మళ్లీ నీట్ యూజీ ఎగ్జామ్‌ పెడితే.. 50శాతం విద్యార్థులు డుమ్మా

మళ్లీ నీట్ యూజీ ఎగ్జామ్‌ పెడితే.. 50శాతం విద్యార్థులు డుమ్మా

దేశ వ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజ్ అయ్యిందని నిరసనలు వెల్లువెత్తాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూన్ 23 నీట్ రీటెస్ట్ నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించింది. వారిలో 48 శాతం మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారని ఎన్టీఏ తెలిపింది. ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హరియాణా, మేఘాలయలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ పరిధిలో ఏడు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు రీటెస్ట్ నిర్వహించారు. 1,563 మంది విద్యార్థుల్లో 813 మంది (52 శాతం) పరీక్షకు హాజరుకాగా, 750 మంది (48 శాతం) గైర్హాజరయ్యారని ప్రకటించింది. 

2024 మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలో 4,750 కేంద్రాల్లో 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు.అయితే ఆ తరువాత విడుదల చేసిన ఫలితాల్లో 60మందికిపైగా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడంతో.. నీట్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి.